హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన సిద్దిపేటలోని అగ్రికల్చర్ ఫామ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు. దాదాపు 50 నిమిషాల ప్రయాణం అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లోని హెలిప్యాడ్కు సీఎం హెలిక్యాప్టర్ చేరుకోనుంది. అనంతరం సీఎం.. కుమ్రంభీం చౌరస్తాకు చేరుకొని, కుమ్రం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించనున్నారు.
ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. చిల్డ్రన్ పార్క్లో కొట్నాక్ భీంరావ్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించనున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడే జిల్లాలోని లబ్ధిదారులకు పోడు పట్టాలు అందజేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం చేసి సాయంత్రం 4 గంటలకు బహిరంగసభలో పాల్గొననున్నారు.