హైదరాబాద్ : భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రాచలం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కుంజా బొజ్జి గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.
కుంజా కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వరరామచంద్రపురం మండలం అడవి వెంకన్నగూడెం గ్రామానికి చెందిన కుంజా బొజ్జి, ఉమ్మడి రాష్ట్రంలో 1985, 89, 1994లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.
మచ్చలేని రాజకీయ నేతగా అత్యంత సాధారణ జీవితం గడుపుతూ గిరిజనుల మనసుల్లో బొజ్జి చిరస్థాయిగా నిలిచిపోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి