హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతామంగేషర్ మరణం భారతీయ సంగీతానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆమె పాట అజరామరం అని శ్లాఘించారు. ఎనిమిది దశాబ్దాలపాటు తన పాటతో భారతీయ సినీ సంగీతంపై ఆమె చెరగని ముద్ర వేశారని కొనియాడారు. భారతదేశానికి లతా మంగేషర్ ద్వారా గంధర్వ గానం అందిందని, ఆమె భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం అని పేర్కొన్నారు. లతా జీ మరణంతో పాట మూగ బోయినట్టయ్యిందని, సంగీత మహల్ ఆగిపోయిందని విచారం వ్యక్తం చేశారు.
‘20 భాషల్లో వెయ్యి సినిమాల్లో 50 వేలకు పైగా పాటలు పాడిన లతా జీ సరస్వతీ స్వర నిధి. ఆమె పాటల మహల్. వెండితెరపై నటి హావభావాలకు అనుగుణంగా ఆ నటే స్వయంగా పాడుతున్నదా అన్నట్టు తన గాత్రాన్ని అందించిన లతాజీ గొప్ప నేపథ్య గాయని. సినీ నిర్మాతలు మొదట హీరో హీరోయిన్లను ఖరారు చేసుకొని సినిమా నిర్మాణం ప్రారంభిస్తారు. కానీ సింగర్గా లతా జీ సమయం ఇచ్చిన తరువాతనే సినిమా షూటింగ్ ప్రారంభించేవారంటే ఆమె గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. పాటంటే లతా జీ.. లతా జీ అంటే పాట. సప్త స్వరాల తరంగ నాదాలలో శ్రోతలను తన్మయత్వంలో ఓలలాడించిన లతా మంగేషర్, ఉత్తర దక్షిణాదికి సంగీత సరిగమల వారధి.
హిందుస్థానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీఖాన్ వద్ద నేర్చుకున్న లతాజీ, ఉర్దూ కవుల సాహిత్యాన్ని అధ్యయనం చేయడంవల్ల తన గాత్రంలో ఉర్దూ భాషలోని గజల్ గమకాల సొబగులను ఒలికించేవారు. కొందరికి పురసారాల వల్ల గౌరవం వస్తే, దేశ విదేశాల్లో ఆమెకు అందిన లెకలేనన్ని పురసారాలకు లతా జీ వల్ల గౌరవం దకింది. ఎందరో గాయకులు రావచ్చు కానీ లతా జీ లేని లోటు పూరించలేనిది’ అని సీఎం స్మరించుకొన్నారు. లతా మంగేషర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.