హైదరాబాద్ : హైదరాబాద్ 8వ నిజాం నవాబు ముఖరం ఝా బహదూర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ముఖరం జా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ను ఆదేశించారు. నిజాం నవాబు భర్కత్ అలీ ఖాన్ వల్షన్ ముకరం ఝా శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్లో ఆయన తుదిశ్వాస విడిచారు.
ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్లో అసఫ్ జాహీ టూంబ్స్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముకరం ఝా పార్ధివదేహాన్ని ఈ నెల 17న టర్కీ నుంచి నగరానికి తీసుకురానున్నారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్లో ఉంచనున్నారు.