హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ చేకూరి కాశయ్య మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నిస్వార్థ రాజకీయనేత అని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. రాష్ర్టం నిజాయితీ కలిగిన సీనియర్ రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు. స్వాతంత్ర సమరయోధుడుగా, తెలంగాణ అభ్యుదయవాదిగా, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని సీఎం కొనియాడారు. చేకూరి కాశయ్య కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.