హైదరాబాద్ : మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి(Solipeta Ramachandra Reddy) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు (Chief Minister KCR ) సంతాపాన్ని ప్రకటించారు. తొలితరం కమ్యూనిస్టు నేత (Communist Leader)గా, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న ‘సోలిపేట’ జీవితం ఆదర్శవంతమైనదని సీఎం తెలిపారు. ఆయన రాజకీయ జీవితంలో సర్పంచి స్థాయి నుంచి ఎమ్మెల్యే(MLA)గా, ఎంపీ(MP)గా ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన క్రమం రేపటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
సిద్దిపేట(Siddipeta) ప్రాంత వాసిగా, రాజకీయ. సామాజిక రంగాల్లో వారు ఆచరించిన కార్యాచరణ, ప్రజా జీవితంలో కొనసాగుతున్న తమ లాంటి ఎందరో నేతలకు ప్రేరణగా నిలిచారని అన్నారు.సోలిపేట రామచంద్రారెడ్డి మరణంతో తెలంగాణ మరో తొలి తరం ప్రజానేతను కోల్పోయిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మాజీ ఎంపీ శ్రీ సోలిపేట రామచంద్రారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు.
తొలితరం కమ్యూనిస్టు నేతగా, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న సోలిపేట జీవితం ఆదర్శవంతమైనది అని సీఎం తెలిపారు.
తన రాజకీయ జీవితంలో సర్పంచి స్థాయి నుంచి…
— Telangana CMO (@TelanganaCMO) June 27, 2023