హైదరాబాద్ : ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ ఆవిర్భావ సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, రైతు ప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం ఉదయం వీరంతా ప్రగతిభవన్కు వెళ్లారు. ఈ సందర్భంగా జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ నేత డి. రాజా సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
On Chief Minister Sri K Chandrashekhar Rao's invitation, all of them came to Pragathi Bhavan at 9.45 am on Wednesday morning.
On this occasion, CM KCR hosted breakfast for the national leaders.#BRSforIndia #AbkiBaarKisanSarkar pic.twitter.com/hbe2soaoHk
— BRS Party (@BRSparty) January 18, 2023
అల్పాహార విందు సమావేశం అనంతరం వీరంతా సీఎం కేసీఆర్తో కలిసి యాదాద్రి బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా యాదాద్రిలో ముఖ్యమంత్రుల పర్యటనకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆలయాన్ని పూలు, తోరణాలతో సుందరంగా అలంకరించారు. సీఎంల కోసం ఆలయంలో ప్రత్యేక ప్రసాదాలు, జ్ఞాపికలను సిద్ధంగా ఉంచారు. మరోవైపు యాదాద్రిలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 1600 పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Delhi CM @ArvindKejriwal, Punjab CM @BhagwantMann, Kerala CM @pinarayivijayan, UP former CM @yadavakhilesh, CPI leader D. Raja and several other leaders participated.
Accompanied by all these leaders, CM KCR left for Yadadri Lakshmi Narasimha Swamy temple to offer special puja. pic.twitter.com/G7VLuX5V1d
— BRS Party (@BRSparty) January 18, 2023
ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ ఆవిర్భావ సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, రైతు ప్రతినిధులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు.
సీఎం శ్రీ కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు బుధవారం ఉదయం 9.45 కు వీరంతా ప్రగతిభవన్కు వచ్చారు.
— BRS Party (@BRSparty) January 18, 2023
ఈ సందర్భంగా జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఢిల్లీ సీఎం శ్రీ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం శ్రీ భగవంత్ మాన్, కేరళ సీఎం శ్రీ పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం శ్రీ అఖిలేశ్ యాదవ్, సీపీఐ నేత శ్రీ డి. రాజా సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
— BRS Party (@BRSparty) January 18, 2023