హైదరాబాద్ : సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్లో జరిగిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూతురు వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను సీఎం కేసీఆర్ ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు మంత్రులు మహముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.