హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు అంశాన్ని పరిశీలిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టు నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ఎంవోపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ తెలిపారు.
ఉద్యోగుల సామాజిక భద్రత దృష్ట్యా సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ను పునరుద్ధరించాలని శుక్రవారం ఢిల్లీలో సీఎం కేసీఆర్ను కోరడంతో సానుకూలంగా స్పందించారని స్థితప్రజ్ఞతెలిపారు. ఈ భేటీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.