ఉక్రెయిన్ యుద్ధ బాధిత విద్యార్థులకు ఇక్కడి కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వండి
చదువు ఆగిపోయి ఆందోళనలో ఉన్నారు
వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది
వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోండి
తెలంగాణ నుంచి 700 మంది విద్యార్థులు
వారికి పూర్తి ఫీజులు మేమే భరిస్తాం
ప్రధాని నరేంద్రమోదీకి సీఎం కేసీఆర్ లేఖ
ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు ఎదుర్కొంటున్న అసాధారణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, దీన్ని స్పెషల్ కేసుగా భావించి సహాయం చేయండి. నిబంధనలు కొంత సడలించి వారు మన దేశంలోని వైద్య కళాశాలల్లో చేరేందుకు వీలు కల్పించండి. తెలంగాణ విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఫీజులు చెల్లించి చదివిస్తుంది. – సీఎం కేసీఆర్
హైదరాబాద్, మార్చి 29 : యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి అర్ధాంతరంగా తిరిగివచ్చిన వైద్య విద్యార్థులకు ఇక్కడి మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మంగళవారం లేఖ రాశారు. చదువు మధ్యలోనే ఆగిపోయి విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఈ విషయంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ విద్యార్థులను స్పెషల్ కేసుగా పరిగణించి మన దేశంలోని వైద్య కళాశాలల్లో సీట్లు సర్దుబాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విద్యార్థులను రాష్ట్రప్రభుత్వమే పూర్తి ఫీజులు చెల్లించి చదివిస్తుందని తెలిపారు. లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్న అంశాలు..