CM KCR | ఈ నెల 30న ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. గిరిజనులకు పోడు పట్టాలను పంపిణీ చేయడంతో పాటు కలెక్టరేట్, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్ననున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సమీక్షించారు. బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సోమవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సభాస్థలి ఏర్పాట్లపై నేతలతో చర్చించారు. మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ శ్రేణులు సమన్వయంతో పని చేసి, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భారీ బహిరంగ సభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా చూడాలని నేతలకు సూచించారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని మంత్రి వివరించారు.