హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణ నుంచి నలుగురు ప్రముఖులకు పద్మ అవార్డులు దక్కాయి. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జీవిత కాల విశిష్ట సేవలను గుర్తించి ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం అందించే పద్మ అవార్డులు తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులకు దక్కడం గొప్ప విషయం అన్నారు. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్లకు సంయుక్తంగా పద్మ భూషణ్ అవార్డు దక్కింది. ఆర్ట్ విభాగంలో పద్మశ్రీ అవార్డులు దక్కించుకున్న దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్య, పద్మజా రెడ్డిలను సీఎం కేసీఆర్ అభినందించారు.