Telangana | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున అత్యాధునిక వసతులతో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్తో పాటు మంత్రులందరూ తమ ఛాంబర్లలో కొలువుదీరారు. అనంతరం పలు దస్త్రాలపై సీఎం కేసీఆర్, మంత్రులు సంతకాలు చేశారు.
సీఎం కేసీఆర్ – కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ దస్త్రం
కేటీఆర్ – జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూంల కేటాయింపు మార్గదర్శకాలు
హరీష్ రావు – టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ నర్సుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ దస్త్రం
తలసాని శ్రీనివాస్ యాదవ్ – ఉచిత చేప పిల్లలు, గొర్రెల పంపిణీ దస్త్రం
నిరంజన్ రెడ్డి – సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా దస్త్రం
గంగుల కమలాకర్ – ఐసీడీఎస్ పథకంలో భాగంగా అంగన్వాడీలకు మే నెల నుంచి పోషకాల సన్నబియ్యం అందించే దస్త్రం
కొప్పుల ఈశ్వర్ – దళిత బంధు రెండో విడత దస్త్రం
ఇంద్రకరణ్ రెడ్డి – జీహెచ్ఎంసీ పరిధిలోని దేవాలయాల్లో దూపదీప నైవేద్య ప్రారంభం దస్త్రం
జగదీశ్ రెడ్డి – వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ దస్త్రం
సబితా ఇంద్రారెడ్డి – ట్యాబ్లు, లైబ్రరీ కార్నర్ దస్త్రం
సత్యవతి రాథోడ్ – రాంజీ గోండు మ్యూజియానికి రూ. 10 కోట్ల కేటాయింపు దస్త్రం
శ్రీనివాస్ గౌడ్ – సీఎం కప్ నిర్వహణకు రూ. 3.2 కోట్ల మంజూరు దస్త్రం
పువ్వాడ అజయ్ – ఆర్టీసీ ఆన్లైన్ సేవల విస్తరణ
మహమూద్ అలీ – కొత్త పోలీస్ స్టేషన్ల మంజూరు దస్త్రం
వేముల ప్రశాంత్ రెడ్డి – రోడ్లు భవనాల శాఖ పునర్వ్యవస్థీకరణ దస్త్రం
మల్లారెడ్డి – శ్రమ శక్తి అవార్డుల దస్త్రం
దయాకర్ రావు – ఐకేపీ గ్రూపులకు మండలాల వారీగా కొత్త భవనాల దస్త్రం