తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజా ఉద్యమాన్ని నడిపిన వీర యోధుడు నల్లా నరసింహులు అని మున్సిపల్ శాఖా మంత్రి కె.టి. రామారావు అన్నారు. నల్లా నరసింహులు జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా ఆయనకు కేటీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నేపథ్యంలో నల్లా నరసింహులు స్పూర్తిని మంత్రి స్మరించుకున్నారు.
అణచివేతకు వ్యతిరేకంగా ప్రతిఘటనా నినాదంగా నిలిచిన ధీశాలి నల్లా నర్సింహులు అని, ఆయన అందించిన స్పూర్తి చాలా గొప్పదని సీఎం అన్నారు. జీవితాంతం తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడి, ప్రజల గుండెల్లో మహోన్నత నాయకుడిగా శాశ్వత స్థానాన్ని నల్లా నరసింహులు సంపాదించుకున్నారని సీఎం ప్రశంసించారు.