హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలియజేశారు. కరుణకు, త్యాగానికి, సౌభ్రాతృత్వానికి నిలువెత్తు నిదర్శనం ఏసుక్రీస్తు బోధనలని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. మానవత్వాన్ని చాటే ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయని సీఎం కేసీఆర్ తెలిపారు. క్షమాగుణం, శాంతి, కరుణ, సహనం, ప్రేమతో జీవించిన క్రీస్తు జీవనగమనం నేటికీ అందరికీ ఆచరణీయమని సీఎం పేర్కొన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డితోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్, ప్రశాంత్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్కుమార్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.