కొత్తపల్లి, మే 8: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వినూత్నంగా నిర్వహించారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు ఆధ్వర్యంలో ముదిరాజ్ కులస్థులు పద్మానగర్ వద్ద మానేరు జలాశయం మధ్యలో తెప్పలపై ‘హ్యాపీ బర్త్డే కమలాకర్ అన్న’ ఇంగ్లిష్ అక్షరాలతో ప్లకార్డులు ప్రదర్శించారు.
అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి గంగుల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కరీంనగర్ మండలంలోని బావుపేటలో హీమోఫిలియా వ్యాధిగ్రస్థుల కోసం సుమారు 50 మంది ప్రజాప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో గంగుల ప్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మేయర్ వై సునీల్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను ఉచితంగా అందజేసి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు.