హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్ తీరాన ఒక పక జ్జానబోధి బుద్ధుడు.. మరో పక రాజ్యాంగ నిర్మాత, కర్తవ్యదీక్షాపరుడు డాక్టర్ బీఆర్ అంబేదర్.. ఎదురుగా త్యాగాలను గుర్తుచేసే అమరవీరుల దీపకళిక నిర్మాణాలతో దేశంలోనే కనీవిని ఎరుగని రీతిలో అత్యంత వైభవోపేతంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటేలా నిర్మితమవుతూ మరికొద్ది రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న తెలంగాణ ప్రజాపాలనా సౌధం.. డాక్టర్ బీఆర్ అంబేదర్ తెలంగాణ సచివాలయ భవనం తుదిమెరుగులు దిద్దుకుంటున్నది. సీఎం కేసీఆర్ దార్శనికతతో.. అత్యంత సహజమైన రీతిలో.. నలు దిశల నుంచి సహజమైన గాలి, వెలుతురు ప్రసరించేలా.. ఆహ్లాదకరమైన వాతావరణంలో సచివాలయ సిబ్బంది విధులు నిర్వహించేలా.. దేశంలోనే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్తో నిర్మితమవుతున్న రాష్ట్ర సచివాలయం ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయ భవనం తుది మెరుగులు దిద్దుకుంటున్న సందర్భంగా పనుల పురోగతిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. సచివాలయ ముఖద్వారం మొదలుకొని నలుదికులా కలియతిరుగుతూ.. రాళ్ల మీద నడుస్తూ.. నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న కర్రలు, ఇనుప చువ్వలను దాటుకుంటూ.. దాదాపు రెండు గంటలకుపైగా నిర్మాణ పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితోపాటు ఇంజినీర్లు, వర్ ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు.