హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): క్రీస్తు బోధనలు ఆచరణీయమని, యేసు మార్గము అనుసరణీయమని సీఎం ఎనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురసరించుకొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందని, మతసామరస్యాన్ని కాపాడుకుంటూ, పరిపాలన పారదర్శకంగా, ప్రజాస్వామికంగా సాగుతుందని పేర్కొన్నారు. క్రైస్తవ సోదరులు ఆనందోత్సవాలతో పండుగ జరుపుకోవాలని కోరారు. క్రీస్తు అనుసరించిన మార్గంలో ముందుకు సాగుతూ అందరూ సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు. దయామయుడు లోకానికి వచ్చిన పర్వదినమైన క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.