CLP Meeting : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన కాంగ్రెస్(Congress) పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే.. ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రకటించాలి అనేదానిపై నిన్నటి నుంచి భారీ కసరత్తు జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని సీఎంగా ఎన్నుకుంటారా? దళితుడు, సీనియర్ నాయకుడు భట్టి విక్రమార్క(BVikramarka)కు పట్టం కడతారా? అని ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో గచ్చిబౌలిలోని ఓ హోటల్లో జరుగనున్న సీఎల్పీ సమావేశం(CLP Meeting)లో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఈ మీటింగ్కు కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలంతా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఏకగీవ్ర తీర్మానం చేసే అవకాశం ఉంది. సీఏం అభ్యర్థి ప్రకటన తర్వాత సాయంత్రం ఎల్బీ స్డేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. తెలంగాణలో నవంబర్ 30వ తేదీన 119 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 65 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. రెండుసార్లు అధికారంలో ఉన్న కేసీఆర్ నాయకత్వలోని బీఆర్ఎస్ అనూహ్యంగా 39 స్థానాలకే పరిమితమైంది. ఇక బీజీపీ, ఎంఐఎం సింగిల్ డిజిట్తో సరిపెట్టుకున్నాయి.