హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్లో తయారైన వస్ర్తాలు తొలిసారి విదేశాలకు ఎగుమతి అయ్యాయి. గ్రీన్ నీడిల్ కంపెనీలో తయారైన ఈ వస్ర్తాలను తొలుత ముంబై పోర్టుకు తరలించి, అక్కడి నుంచి అమెరికాలోని న్యూయార్క్కు ఎగుమతి చేసినట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు శుక్రవారం ట్విట్టర్లో వెల్లడించారు.
సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్లో ఏర్పాటైన మొదటి కంపెనీ గ్రీన్ నీడిల్. స్థానిక మహిళలకు శిక్షణ ఇచ్చి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఈ సంస్థ విదేశాలకు వస్ర్తాల ఎగుమతిని ప్రారంభించిందని చెప్పేందుకు సంతోషిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.