ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడేనికి చెందిన యువకుడు వాసం వివేక్ యూరప్లోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15న అధిరోహించాడు. సముద్ర మట్టానికి 5,642 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతంపై జాతీయ జెండాతోపాటు, తెలంగాణ రాష్ట్ర చిత్రపటాన్ని ప్రదర్శించి దేశభక్తి, రాష్ట్ర ఖ్యాతిని చాటాడు. వివేక్ హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
–మంగపేట