Bhatti Vikramarka | ధర్మసాగర్, ఏప్రిల్ 26: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. యాత్ర బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి చేరుకున్నది. ఈ క్రమంలో వడ్డెర కాలనీ వద్ద ఆ పార్టీ నాయకుడు గంగారపు అమృతరావు భట్టి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సహా పలువురు కాంగ్రెస్ నేతలను వేదికపైకి ఆహ్వానించారు.
నియోజకవర్గ్గానికి చెందిన కృష్ణను ఆహ్వానించలేదని ఆయన వర్గీయులు కేకలు వేశారు. మహిళా నాయకురాలు ఇందిర వర్గీయులు అరుస్తూ కృష్ణ వర్గీయులను బయటకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇరువర్గాలు వాగ్వాదం చేసుకోగా, వారి మధ్య తోపులాట జరిగింది.