హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ధోబీఘాట్లు, ల్యాండ్రీలు, హెయిర్ కంటింగ్ సెలూన్లకు అందిస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్తుపై నూతన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని తెలంగాణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ గురువారం కోరారు.
గత ప్రభుత్వం నాయీబ్రాహ్మణులు, రజకులకు అం డగా నిలిచేందుకు ఉచిత విద్యుత్తును అందిస్తూ వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో గత మూడు నెలలుగా బిల్లులు నిలిచిపోయాయని తెలిపారు. పెరుగుతున్న బిల్లులను చూసి వృత్తిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వృత్తిదారులను ఆదుకోవాలని కోరారు.