శ్రీశైలం/హైదరాబాద్, మార్చి 14: శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకొన్నారు. సోమవారం తెల్లవారుజామున గంగాధర మండ పం నుంచి ఆలయ ప్రవేశం చేసిన ఎన్వీ రమణ దంపతులకు శ్రీకృష్టదేవరాయ గోపురం వద్ద ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చక వేదపండితులు తిలక ధారణ చేసి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికా రు. జస్టిస్ ఎన్వీ రమణ వెంట తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్చంద్ర దంపతులు, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, ఏపీ హై కోర్టు రిజిస్ట్రార్ జనరల్ రవీంద్రబాబు తదితరులు ఉన్నారు. ఆలయ ప్రాకారంలోని పరివార దేవతలను దర్శించుకొన్న జస్టిస్ రమణ దంపతులు.. కంచికామకోటి మఠంలో నిర్వహించిన రుద్ర చండీహోమ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.