హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో సివిల్ సర్వీసెస్ అకాడమీని త్వరలోనే ప్రారంభించనున్నారు.వర్సిటీలో చదువుతున్న గ్రామీణ విద్యార్థులు సివిల్ సర్వీసులాంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలన్నదే ఈ అకాడమీ ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.
ఈ అకాడమీలో ఒకేసారి వెయ్యిమంది అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ అకాడమీ విద్యార్థుల ప్రయోజనాలకు బాగా ఉపయోగపడుతుందని వీసీ రవీందర్యాదవ్ తెలిపారు.