దుండిగల్, మార్చి 7: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) హరితహారం అవార్డు లభించింది. హైదరాబాద్లోని హోటల్ ఐటీసీ కాకతీయలో మంగళ వారం సీఐఐ చైర్మన్ వాగీశ్దీక్షిత్ చేతులమీదుగా కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్రెడ్డి అవార్డును అందుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ (నేషనల్ సర్వీస్ స్కీం) విద్యార్థులు కాలేజీ క్యాంపస్, దత్తత గ్రామాల్లో 2,550 మొక్కలు నాటిన నేపథ్యంలో ఈ అవార్డును ప్రకటించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే శ్రీనివాస్రావు, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ఉదయ్ రంజన్గౌడ్, వలంటీర్ల కృషిని కళాశాల చైర్మన్ అభినందించారు. సీఐఐ హరితహారం అవార్డును అందుకున్న అనంతరం ఎంఎల్ఆర్ విద్యాసంస్థల అధినేత మర్రి లక్ష్మణ్రెడ్డి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మర్రి లక్ష్మణ్రెడ్డిని మంత్రి అభినందించారు.