హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): గిరిజనులకు అధిక వడ్డీల ఆశ చూపి రూ.100 కోట్లను వసూలు చేసిన మైక్రోఫైనాన్స్ పెట్టుబడులపై ప్రభుత్వం తక్షణం స్పందించి సీబీసీఐడీ విచారణకు ఆదేశించాలని, బాధితులకు న్యా యం చేయాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్, ప్రధాన కార్యదర్శి శ్రీరాంనాయక్ సో మవారం ప్రకటన విడుదల చేశారు. గిరిజనులకు అధిక వడ్డీల ఆశచూపి కోట్లల్లో వసూలు చేశారని ఆరో పించారు. ప్రభుత్వం, పోలీసులు స్పందించకపోవడంతోనే నెలరోజుల్లోనే నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏజెంట్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకూ సంఘం పోరాడుతుందని వెల్లడించారు.