గంగాధర, అక్టోబర్ 8: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను అక్కున చేర్చుకుని అండగా ఉంటున్నారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, దీవెన దంపతులు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాలతోపాటు మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలానికి చెందిన పలువురు అనాథ పిల్లలను ఆదివారం ఆనవాయితీ ప్రకారం ఈ సారి కూడా దసరాను పురస్కరించుకొని గంగాధర మండలం బూరుగుపల్లిలోని తన ఇంటికి ఆహ్వానించారు. ఎమ్మెల్యే దంపతులు వారిని ఆప్యాయంగా పలుకరించారు. బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. దసరాను పురస్కరించుకొని వారికి కొత్త దుస్తులు అందజేశారు.