Congress |రామడుగు, అక్టోబర్ 28: కాంగ్రెస్లో 22 ఏండ్లుగా కార్యకర్తగా పనిచేస్తున్నానని, తన సేవలను గుర్తిస్తుందని.. చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ తనకే ఇస్తుందన్న నమ్మకంతో ఉన్న తనకు పార్టీ ద్రోహం చేసిందని కాంగ్రెస్ యువజన విభాగం పార్లమెంటరీ అధ్యక్షుడు నాగి శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థిగా మేడిపల్లి సత్యంను ఖరారు చేయడంపై నిరాశ చెందారు. చొప్పదండిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఈరోజు తనను గుర్తించకపోవడం బాధగా ఉన్నదని కన్నీటి పర్యంతమయ్యారు.