కూసుమంచి, జనవరి 6: ఖమ్మం జిల్లా పాలేరుకు వచ్చిన పావురం చైనాది కాదని.. కర్నూలు నుంచి వచ్చిన పందెం కపోతం అని తేలడం తో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇలా కాలుకి ట్యాగ్ ఉన్న పావురాలు కనిపించడంతో అవి చైనా కపోతాలంటూ పుకార్లు షికార్లు చేశా యి. ఈ క్రమంలో పాలేరులోని నునావత్ నవీన్ పట్టుకున్న పావురం కాలుకు ఉన్న ట్యాగ్లోని నంబర్కు ఫోన్ చేయగా అసలు విషయం తెలిసింది. ఏపీలోని కర్నూలుకు చెందిన రాజు అనే వ్యక్తి పెంచుకొన్న పావురం పందెంలో వదలడంతో దారితప్పిందని తెలిపారు. వీలైతే పం పాలని, లేదంటే సాదుకోమని చెప్పినట్టు నవీన్ పేర్కొన్నారు. కాలుకు గాయం కావడంతో ప్రస్తుతం ఆ పావురాన్ని నవీన్ వద్దే ఉంచుకున్నా డు. ఇటీవల కర్నూలులో పావురాల పందేలు జరిగాయని, వాటిలో పాల్గొన్న పావురా లు కొన్ని దారి తప్పి ఇటు వచ్చాయని స్థానికులు చెప్తున్నారు.