సూర్యాపేట : మిరప పంటను(Chilli crop) ఏరేందుకు వెళ్తున్న కూలీల(Chili workers) ఆటో బోల్తా పడటంతో (Auto overturned )ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట (Suryapeta) జిల్లా కోదాడ మండలం చిమిర్యాల వద్ద గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఆటోలో 14 మంది కూలీలు మిరపకాయలు ఏరేందుకు బయల్దేరారు.
చిమిర్యాల క్రాస్రోడ్డు(Chimiryala Crossroads) వద్దకు రాగానే ఆటో ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా(Three were injured) క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.