వరంగల్ : వేడినీటి బకెట్లో పడి చిన్నారి దుర్మరణం పాలైంది. ఈ విషాద ఘటన చెన్నారావుపేట మండలం కందగడ్డతండా శివారు అవుసలితండాలో గురువారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. తండాకు చెందిన సహదేవుల వెంకన్న కూతురు జాహ్నవి (3) స్నానం చేసే క్రమంలో వేడినీటి బకెట్లో కూర్చున్నది. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం మొదట హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.