తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లిన ఆయన.. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారికి రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందజేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు. కరోనా నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని భగవంతుడిని కోరినట్లు చేప్పారు.