ట్రెసా నేతల హర్షం
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో చర్చించి పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ హామీ ఇచ్చారని ట్రెసా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగ రవీందర్రెడ్డి, కే గౌతమ్కుమార్ తెలిపారు. బుధవారం బీఆర్కేభవన్లో సీఎస్ను కలిసి దీర్ఘకాలం పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ముఖ్యంగా తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులు, రెవెన్యూ ఉద్యోగుల మ్యూచువల్ బదిలీలు/మిగిలి పోయిన స్పౌజ్/మెడికల్ /రిక్వెస్ట్ బదిలీలు, వీఆర్వోల సర్దుబాటు, వీఆర్ఏలకు పేసేల్, సుదూర జిల్లాల్లో పని చేస్తున్న ప్రొబేషనరీ నాయబ్ తాసిల్దార్ల అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని కోరినట్టు పేర్కొన్నారు.
తమ విజ్ఞప్తికి స్పందించిన సీఎస్ డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతుల విషయంలో స్పష్టత వచ్చిందని, ముఖ్యమంత్రితో చర్చించి ప్రమోషన్లు కల్పిస్తామని తెలిపారన్నారు. బదిలీలు సాధ్యమైనంత త్వరలో చేస్తామని చెప్పారన్నారు. వీఆర్ఏల సమస్యల పరిషారం కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వివరించారు. కంప్యూటర్ ఆపరేటర్లకు కొత్త పీఆర్సీ ప్రకారం 30% వేతనం పెంపుదల వంటి పలు సమస్యలపై సీఎస్ స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు.