బండ్లగూడ : ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు వరంగా మారిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కిస్మత్పూర్ గ్రామానికి చెందిన రేణుక, చంద్రయ్యలకు శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణి చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నిరు పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డి, సురేశ్గౌడ్ తదితరులు ఉన్నారు.