హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్కు చేరుకొన్న సీఎం.. అక్కడ సైనిక్ వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి యుద్ధవీరులకు నివాళి ఆర్పించారు. తర్వాత నాంపల్లి పబ్లిక్ గార్గెన్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. గవర్నర్ తమిళిసైకి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు, న్యాయాధిపతులు, పలువురు స్వాతంత్ర సమరయోధులు పాల్గొన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన స్పీకర్ గడ్డం ప్రసాద్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని సీఎం పరామర్శించారు.