హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) భేటీ ఉన్న నేపథ్యంలో రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయ న సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వా త గత మూడునెలల్లో ఢిల్లీకి వెళ్లడం ఇది 11వ సారి. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నవారెవ్వరూ ఇంత స్వల్ప వ్యవధిలో ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లిన చరిత్రలేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకటిరెండు సార్లు రేవం త్ ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. మిగిలిన పర్యటనలన్నీ ప్రధానంగా పార్టీ వ్యవహారాలపై చర్చించేందుకు, నిర్ణయాలు తీసుకునేందుకేనని తెలుస్తున్నది. ఢిల్లీలో బుధవారం కాంగ్రెస్ పార్టీ సీఈసీ భేటీ జరగనున్నది. దీనికి రేవంత్తోపాటు మంత్రి ఉత్తమ్ కూడా హాజరవుతున్నారు.