Mallanna Sagar | హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ)/గోదావరిఖని: నదిని సాగరంగా మార్చి న ముఖ్యమంత్రి కేసీఆర్.. మల్లన్నసాగర్, కొండపోచమ్మ జలసాగరాలను చూసి మ హాదానంద పడ్డారు. తన జలస్వప్నం సాకారమైనందుకు గోదారమ్మను చూసి పులకించిపోయారు. శుక్రవారం మంచిర్యాల పర్యాటనకు హెలికాప్టర్లో వెళ్తూ మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, గోదావరిని సీఎం కేసీఆర్ వీక్షించారు. మంచిర్యాల సభలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ‘గతంలో చా లాసార్లు, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లికి వచ్చినప్పుడు గోదావరిని చూసి బాధపడ్డాను. ‘అమ్మా..! తల్లీ గోదావరి మా భూ మి మీదకు ఎప్పుడొస్తవ్? అని దండం పెట్టుకునేది. గోదావరిణిలో రూపాయి నాణే లు వేసేందుకు చుక్కనీరు కూడా ఉండకపోయేది. ఎక్కడో చిన్నధార ఉన్నచోట, మడుగుల్లో నాణేలు వేసేది. ఇప్పుడు నేను హెలికాప్టర్లో వస్తున్నప్పుడు గోదావరిని చూసి నా.. నా కళ్లు నిండినయ్. ఆనందబాష్పాలు వచ్చినయ్.. సజీవమైన గోదావరి బ్రాహ్మాండంగా కండ్లముందు కనిపిస్తుంటే చాలా పొంగిపోయినం. చాలా సంతోషపడ్డం. ఇ లాంటి గోదావరిని చూస్తమా అనుకున్నాం. కానీ తెలంగాణ వచ్చిన ఫలితం పట్టుబట్టి, జట్టుకట్టి.. లక్ష్మి, పార్వతి, సరస్వతి బ్యారేజ్లతోపాటు పెండింగ్లో ఉన్న ఎల్లంపల్లి పూర్తి చేసుకుంటే 250 కిలోమీటర్ల గోదావరిని సస్యశ్యామలం చేసుకుంటం’ అని తన ఉద్యమ.. ఉద్వేగ సందర్భాన్ని.. ప్రస్తుత సన్నివేశాల కేసీఆర్ ఆవిష్కరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో నిండుకుండలా ప్రవహిస్తున్న గోదావరి నదిని చూసి సీఎం కేసీఆర్ పులకించిపోయారు. మంచిర్యాల పర్యటన అనంతరం రోడ్డు మార్గాన హైదరాబాద్కు వెళ్తుండగా గోదావరిఖనిలోని నది వంతెనపై కొద్ది సేపు ఆగారు. గోదావరి నిండుకుండలా ఉండడాన్ని సీఎం కేసీఆర్ దగ్గర నుంచి చూశారు. ఇప్పటివరకు ఏరియల్ వ్యూ ద్వారా గోదావరిని తిలకించిన ముఖ్యమంత్రి.. వంతెన పైనుంచి గోదావరి తల్లి ప్రణమిల్లారు. వేద బ్రాహ్మణులతో కలిసి గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మ తల్లికి నమస్కరించి హారతి పట్టారు. పూలు, పట్టువస్ర్తాలు సమర్పించి నమస్కరించారు. సీఎం కేసీఆర్కు ఘనంగా స్వాగతం పలికేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కోలాట నృత్యాలు ప్రదర్శించారు. ఇక్కడ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తదితరులు ఉన్నారు.