హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): వీఆర్ఏలు ఇకపై పేస్కేల్ ఉద్యోగులని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 10వ తరగతి అర్హత కలిగిన 10,317 మంది నీటిపారుదల, మిషన్ భగీరథ విభాగాల్లో పనిచేస్తారని చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన 2,761 మంది రికార్డు అసిస్టెంట్ హోదాలో, డిగ్రీ, ఆ పై విద్యార్హత కలిగిన 3,680 మంది జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తారని స్పష్టం చేశారు. ఈ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిందని వెల్లడించారు. అం దరూ ఆయా విభాగాల్లో ఉత్తమ సేవలు అందించి, మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. వీఆర్ఏల్లో 3,797 మంది 61 ఏండ్లు దాటిన వారు ఉన్నారని తెలిపారు. వారు కొనసాగుతున్న క్వాలిఫికేషన్తోనే వారి పిల్లలకు ఉద్యోగాలిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలిపారు.
తమ కుటుంబాల్లో వెలుగులు నిం పిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణ పడి ఉంటామని వీఆర్ఏ జేఏసీ నేతలు చెప్పారు. వీఆర్ఏ కుటుంబాలతో త్వరలో భారీ కృతజ్ఞత సభ ఏర్పా టుచేస్తామని వెల్లడించారు.