CM KCR | పెద్దపల్లి : గోదావరిఖని బ్రిడ్జి వద్ద గోదావరి నదికి ముఖ్యమంత్రి కేసీఆర్ హారతి ఇచ్చారు. మంచిర్యాల జిల్లాలో తన పర్యటన ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వస్తుండగా, పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని పట్టణంలో కేసీఆర్ ఆగారు. అక్కడ గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొని గోదారికి కేసీఆర్ పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్, దివాకర్ రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మంచిర్యాల పర్యటనలో భాగంగా ఆ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కేసీఆర్ ప్రారంభించారు. రెండో విడుత గొర్రెల పంపిణీ, కులవృత్తులకు లక్ష రూపాయాల ఆర్థిక సాయం, గృహలక్ష్మీ పథకాలను కూడా కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు.