యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూ రు మున్సిపాలిటీ కేంద్రంలోని అన్నెపు శ్రవణ్గౌడ్ తన వ్యవసాయ బావి వద్ద ఉన్న తాటి చెట్లకు కల్లును తీసి జీవనాధారం పొందుతున్నాడు. కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తులు కల్లును దొంగతనం చేస్తుండటాన్ని గమనించి రూ.12 వేలతో తాటిచెట్టుపై సోలార్ సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు.
అప్పటి నుంచి కల్లు చోరీ కావడం లేదని గీత కార్మికుడు తెలిపారు. కల్లుకు వచ్చే వారు కూడా నిఘా నీడలో ప్రశాంతంగా కల్లు తాగి ఎలాంటి గొడవలకు తావులేకుండావెళ్తున్నారని తెలిపారు.