దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర చరిత్రలో గొప్ప సందర్భం. ఒకనాడు అనేక అవమానాలకు గురైన తెలంగాణ, నేడు అత్యద్భుతంగా వెలుగొందుతున్నది. విద్యుత్తు, వ్యవసాయం, సాగునీరుసహా ప్రతి రంగంలో దేశానికే ఆదర్శంగా ప్రగతి నమోదు చేస్తున్నది. నేడు స్వయంపాలన ఫలాలు ప్రజలకు అందుతున్నవి. పదేండ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని పల్లెపల్లెనా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవాలి.
– సీఎం కేసీఆర్
CM KCR | హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర పదేండ్ల ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమంసహా ప్రతిరంగంలో సాధించిన అద్భుత విజయాలను పల్లెపల్లెనా ప్రజల ముందు ఉంచాలని అధికారులను ఆదేశించారు. 21 రోజుల పాటు నిర్వహించే అవతరణ ఉత్సవాల ప్రారంభ వేడుకలను జూన్ 2న సచివాలయంలో నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఉత్సవాల నిర్వహణ, కార్యాచరణ సంబంధిత అంశాలపై సీఎం సచివాలయంలో శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 21 రోజులపాటు అధికారిక కార్యక్రమాలను నిర్వహించటంపై చర్చించారు. దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గొప్ప సందర్భమని సీఎం కేసీఆర్ అన్నారు.
ఒకనాడు అనేక అవమానాలకు గురైన తెలంగాణ, నేడు అత్యద్భుతంగా వెలుగొందుతున్నదని తెలిపారు. విద్యుత్తు, వ్యవసాయం, సాగునీరుసహా ప్రతి రంగంలో దేశానికే ఆదర్శంగా ప్రగతి నమోదు చేస్తున్నదని చెప్పారు. ‘నేడు స్వయంపాలన ఫలాలు ప్రజలకు అందుతున్నవి. పదేండ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని పల్లెపల్లెనా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవాలి. ఒకనాడు కరెంటు కోతలతో కారు చీకట్లలో మగ్గిన తెలంగాణలో నేడు విద్యుత్తు రంగాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుకోవడంతో రాష్ట్రం వెలుగులు విరజిమ్ముతున్నది. 24 గంటల విద్యుత్తును రైతాంగానికి ఉచితంగా, నిరంతరాయంగా అందిస్తున్నాం. ఇదంతా ఎంతగానో కష్టపడితే తప్ప సాధ్యం కాలేదు. ఇవే విషయాలను ప్రజలకు వివరించాలి. గత పాలనలో విస్మరించబడిన విద్యుత్తు ఉత్పాదన, ప్రసార వ్యవస్థలను దార్శనికతతో, పట్టుదలతో పటిష్ఠపరుచుకోవడం ద్వారానే విద్యుత్తు విజయం సాధ్యమైంది. ఈ విషయం తెలంగాణ ప్రజలకు అనుభవంలోకి వచ్చింది’ అని సీఎం అన్నారు.
విద్యుత్తు రంగం మాదిరే తెలంగాణ ప్రభుత్వం పటిష్ఠపరిచిన వ్యవసాయం, సంక్షేమం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం తదితర రంగాల్లో సాధించిన అభివృద్ధిని పేరుపేరునా ప్రజలకు పలు ప్రసార మాధ్యమాలు, మార్గాల ద్వారా చేరవేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. స్వరాష్ట్ర సాధన ఫలాలను అనుభవిస్తున్న తెలంగాణ ప్రజలతో ఈ మూడు వారాల పాటు మమేకం కావాలని, వారి భాగస్వామ్యంతో పల్లె నుంచి పట్నం దాకా దశాబ్ది ఉత్సవాలను ఆటపాటలతో పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని తెలిపారు. సచివాలయంలో ప్రారంభ వేడుకల ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.
ఆహ్వానితులకు పారింగ్ సౌకర్యం, అతిథులకు ‘హై టీ’ ఏర్పాటు వంటి కార్యక్రమాలను ఎకడ, ఎట్లా నిర్వహించాలో వివరిస్తూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, శేరిసుభాష్రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, సీఎస్ శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్రావు, డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సీఎం సెక్రటరీలు స్మితాసభర్వాల్, భూపాల్రెడ్డి, ఆర్ అండ్ బీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, ఐ అండ్ పీఆర్ కమిషనర్ అశోక్రెడ్డి, జాయింట్ డైరెక్టర్ జగన్ తదితరులు పాల్గొన్నారు.