హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు ఏ కృష్ణారావు, హిందుస్థాన్ టైమ్స్ అసోసియేట్ ఎడిటర్ ఏ శ్రీనివాసరావుల తల్లి సంపతమ్మ (88) మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబసభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తెలంగాణ సాయుధ పోరాటకాలంలో మఖ్దూమ్ మొహియుద్దీన్తో కృష్ణారావు, శ్రీనివాసరావుల తండ్రి అప్పరుసు శేషగిరిరావు కలిసి పనిచేశారు. శేషగిరిరావు భార్య సంపతమ్మ కరుడుగట్టిన తెలంగాణవాది. ఆమె సీఎం కేసీఆర్కు వీరాభిమాని కూడా. శేషగిరిరావు-సంపతమ్మ దంపతులకు ఐదుగురు కుమారులున్నారు.