ఖమ్మం లీగల్, సెప్టెంబర్ 24: దేశంలో ప్రతిఒక్కరికీ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉన్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. ఖమ్మంలో శనివారం రాష్ట్ర న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో ‘సత్వర న్యాయం-న్యాయవాదుల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. న్యాయవాదులు ఇరుపక్షాలకు అన్యాయం జరగకుండా సత్వర న్యాయం అందేలా చూడాలని సూచించారు. భారత న్యాయవ్యవస్థ ప్రపంచంలోనే గొప్పదని కొనియాడారు.
కేసు పూర్వాపరాలు పరిశీలించి బాధితులకు న్యాయవాదులు న్యాయం చేయాలన్నారు. నిజాయతీగా ప్రాక్టీస్ చేయాలని, వృత్తిపై నిబద్ధతతో ఉండాలని చెప్పారు. కోర్టు ఆఫీసర్గా న్యాయవాది పాత్ర ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. కార్యక్రమంలో హైకోర్టు జడ్జి జస్టిస్ టీ వినోద్కుమార్, జిల్లా జడ్జి టీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.