Chhattisgarh | హైదరాబాద్, ఫిబ్రవరి22 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన సమ్మక్క బరాజ్కు ఎన్వోసీ ఇచ్చేందుకు పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొత్త పేచీని పెట్టింది. 88 మీట ర్ల వరకు ముంపునకు గురయ్యే భూ ములకు సైతం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నది.
సమ్మక్క బరాజ్ ఎఫ్ఆర్ఎల్ (పూర్తిస్థాయి నీటినిల్వ) 83 మీటర్లు కాగా, ఆ మేరకు నీటిని నిల్వ చేసినప్పుడు మాత్రమే ఛత్తీస్గఢ్లో భూములు ముంపునకు గురవుతాయని, ఆ మేరకు ముంపునకు గుర య్యే భూములకు పరిహారం చెల్లిస్తామ ని ఛత్తీస్గఢ్ ఎదుట తెలంగాణ ప్రతిపాదించింది. ఎన్వోసీ ఇచ్చేందుకే తొ లుత సుముఖత వ్యక్తంచేసింది. కానీ ఎఫ్ఆర్ఎల్ 83 మీటర్ల వరకు గాకుం డా, 88 మీటర్ల వరకు ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చె ల్లించాలని షరతు విధించింది.