హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): తాను పార్టీ మారుతున్నానంటూ సామాజిక మాధ్యమాల్లో వ స్తున్న వార్తల్లో నిజం లేదని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని ఒక ప్రకటనలో తెలిపారు. కొందరు పని గట్టుకొని తనపై చేస్తున్న ఆరోపణలు, వదంతులను ఎవ్వరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
తన కాలికి తగిలిన గాయం కారణంగా మునుగోడు ప్రచారంలో ప్రత్యక్షంగా పాల్గొనలేక పోతున్నట్టు వివరించారు. రోజూ అక్కడి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఫోన్లో మాట్లాడుతున్నానని తెలిపారు. మునుగోడులో సర్వేలన్నీ టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయని, గులాబీ జెండా ఎగరడం పకా అని చెప్పారు. రాష్ట్ర పౌల్ట్రీ రైతులు, పౌల్ట్రీ పరిశ్రమ ఎల్లప్పుడూ సీఎం కేసీఆర్ వైపే ఉంటారని తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్రెడ్డికే మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.