సూర్యాపేట, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రోకర్లుగా వ్యవహరిస్తూ జోకర్ల మాదిరిగా మాట్లాడుతున్నారని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. వీరు నిలకడ లేకుండా పిచ్చిపట్టినట్టు మాట్లాడుతూ రాజకీయాలను స్వార్థానికి వాడుకుంటారని మండిపడ్డారు. తరచూ పార్టీలు మార డం, ఓ పార్టీలో ఉంటూ మరో పార్టీకి అనుకూలంగా మాట్లాడే కోమటిరెడ్డి బ్రదర్స్ను బ్రోకర్లు, జోకర్లు అనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. ఇటీవల కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై శనివారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణమే అయినా నకిరేక ల్, సూర్యాపేట, తుంగతుర్తిలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాట్లాడిన భాష, ప్రవర్తించిన తీరు అత్యంత అసహ్యకరంగా ఉన్నదని అన్నా రు.
మునుగోడు ఉప ఎన్నికను తీసుకొచ్చి కాం గ్రెస్ పార్టీని పాతాళానికి తొక్కాలని చూసిన రాజగోపాల్రెడ్డి పక్కా కమర్షియల్ లీడర్ అని విమర్శించారు. దళిత ఎమ్మెల్యే అయిన చిరుమర్తి లింగయ్య, మంత్రి జగదీశ్రెడ్డిపై రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అ న్నారు. నల్లగొండ జిల్లా ఉద్యమ స్ఫూర్తిని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనీయమంటున్న రాజగోపాల్రెడ్డి.. అసెంబ్లీ ఏమైనా ఆయన అయ్య జాగిరా? అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరి పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ టికెట్లు ఇస్తామని కోట్లు దండుకున్నది నిజం కాదా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్ను ఎందుకు దించాలో చెప్పే దమ్ము ఉన్నదా? అని సవాల్ విసిరారు. జీవితమంతా బ్రోకర్ పనులు చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్.. తక్షణమే ఆ పనులు మానేయాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టాలంటే రాజగోపాల్రెడ్డి వంటి నాయకులను పార్టీ నుంచి పంపేయాలని సూచించారు.