హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): తనను, తన కొడుకును చంపుతానని బెదిరించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ శనివారం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రేకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై ఇప్పటికే పార్టీకి ఫిర్యాదు చేసినప్పటికీ కనీస చర్యలు తీసుకోకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. జిల్లాలోనూ వెంకట్రెడ్డి పరిధి దాటి వ్యవహరిస్తున్నారని, తన చర్యలతో పార్టీని బలహీన పరుస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలుస్తున్నది. ఆయనపై చర్యలు తీసుకోకపోతే, తానే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని హెచ్చరించినట్టు తెలిసింది.