హైదరాబాద్ : చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరారు. బుధవారం ఉదయం ప్రగతి భవన్కు చేరుకొని.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో భేటీ అయ్యారు. గత కొద్ది రోజుల కిందట ఓదెలు తన భార్య, మంచిర్యాల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మితో కలిసి టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే.
తాజాగా ఆయన మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరారు. ఇవాళ ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఓదెలు తన రాజకీయ జీవితాన్ని టీఆర్ఎస్తో ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో 2010లో రాజీనామా చేసి.. మరోసారి గెలుపొందారు. 2014లోనూ టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.