హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న పీఆర్టీయూ టీఎస్, టీటీ జేఏసీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డికి 33 సంఘాలు మద్దతు ప్రకటించాయి. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో టీఎస్ జీహెచ్ఎంఏ, ఆర్యూపీపీ టీ, పెటా టీఎస్, టీజీపెటా, పీఎంటీఏ టీఎస్, కేజీబీవీ, రెసిడెన్షియల్, మాడల్ స్కూల్, ఇంటర్ కాంట్రాక్ట్ అధ్యాపక సంఘాలు, బీసీ, మైనార్టీ, ఉర్దూ టీచర్ సంఘాలు మద్దతు తెలిపాయి.